
ఆమె పేరు నిలూఫర్.ఆమె జనవరి 4, 1916న ఇస్తాంబుల్లో జన్మించింది.
ఆమె తల్లి ఆదిలే సుల్తాన్, ఒట్టోమన్ సుల్తాన్ మురాద్ V మనవరాలు.
ఆమె ప్యాలెస్లలో పెరిగింది, ఫ్రాన్స్లో చదువుకుంది, ఫ్రెంచ్, టర్కిష్ మరియు ఇంగ్లీష్ భాషలలో అనర్గళంగా మాట్లాడేది.
ఆమె ఒట్టోమన్ సామ్రాజ్యపు చివరి యువరాణులలో ఒకరు.1931లో, 15 ఏళ్ల వయసులో, అప్పటి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన , హైదరాబాద్ నిజాం రెండో కుమారుడు ప్రిన్స్ మోజం జాహ్తో ఆమెకు వివాహం జరిగింది.
భారతదేశం గురించి దాదాపు ఏమీ తెలియకుండానే ఆమె హైదరాబాద్ చేరుకుంది.
ఆమె చీర కట్టడం నేర్చుకుంది. ఉర్దూ నేర్చుకుంది. పర్దా పాటించడానికి నిరాకరించింది.
నిజాం కుటుంబంలోని ఇతర మహిళలు మూసి ఉన్న తలుపుల వెనుక ఉండిపోగా, నిలూఫర్ బహిరంగ కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు మరియు సామాజిక సమావేశాలకు హాజరయ్యేది.
అంతర్జాతీయ పత్రికలు ఆమెను ప్రపంచంలోని పది మంది అత్యంత అందమైన మహిళల్లో ఒకరిగా పేర్కొన్నాయి.
కానీ ఆ గ్లామర్ వెనుక ఆమె వ్యక్తిగత జీవితం బాధాకరంగా ఉండేది.ఆమెకు పిల్లలు కలగలేదు.
1948లో ఆమె భర్త రెండో భార్యను చేసుకున్నాడు. 21 ఏళ్ల తర్వాత 1952లో అతను నిలూఫర్కు విడాకులు ఇచ్చాడు.
విడాకులకు మూడు సంవత్సరాల ముందు, ఆమెకు ఎంతో ఇష్టమైన పనిమనిషి రఫతున్నీసా ప్రసవ సమయంలో తగిన వైద్య వసతులు లేకపోవడం వల్ల మరణించింది..
తీవ్రంగా బాధపడిన ఆమె “ఇకపై ఏ రఫత్ కూడా మరణించకూడదు.”
అని డిసైడ్ అయింది మహిళలు మరియు పిల్లల కోసం ఒక ప్రత్యేక ఆసుపత్రిని నిర్మించాల్సిందిగా ఆమె నిజాంను ఒప్పించింది.
ఇది హైదరాబాద్లోని రెడ్ హిల్స్లో నిర్మించబడి 1953లో ప్రారంభమైంది.నిజాం దీనికి నిలూఫర్ హాస్పిటల్ అని పేరు పెట్టాడు.
అది ప్రారంభం కావడం ఆమె ఎన్నడూ చూడలేదు. ఆమె అప్పటికే ఫ్రాన్స్ వెళ్ళిపోయింది.ఆమె తన శేషజీవితాన్ని పారిస్లో గడిపింది.
జూన్ 12, 1989న ఆమె73 సంవత్సరాల వయసులో మరణించింది.హైదరాబాద్లోని నిలూఫర్ హాస్పిటల్ నేటికీ నిలిచి ఉంది.
ఇది 500 పడకలను కలిగి ఉంది మరియు ప్రతి సంవత్సరం వేలాది మంది తల్లులు, పిల్లలకు చికిత్స అందిస్తుంది.ఆమె ఎన్నడూ తల్లి కాలేదు.
కానీ వేలాది మంది ఇతరులు తల్లులకు పిల్లలకు ప్రాణదారం అయింది ❤️
