
పెళ్లయి ఇద్దరు బిడ్డలు కలిగిన తర్వాత భర్త సోదరుడుతో అక్రమ సంబంధం… ఆ తర్వాత భర్తను వదిలేసి అతనితో కాపురం పెట్టింది . ఆ తర్వాత కొన్నాళ్ళకి పక్కింటి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.
అభ్యంతరం చెప్పాడని,రెండో భర్తను హత్య చేసింది.ఆతర్వాత ఆ ప్రియుడుతో వేరే చోటికి వెళ్లి అక్కడ కాపురం పెట్టింది .
అక్కడ కూడా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం మళ్లీ ఇతడు హత్య.. ఇలాగే అక్రమ సంబంధం మీద అక్రమ సంబంధం.. ఆమె రూటే వేరు.
కొన్ని వివాహ సంబంధాలలో ,మహిళల్లో మానసిక హింస ప్రవృత్తి, అక్రమ సంబంధాలపై మోజు ఎలా పెరిగిపోతున్నాయో ఈ సంఘటన ఉదాహరణ.
గుజరాత్ లోని.అహ్మదాబాద్ కు చెందిన జాగృతి అనే మహిళకు సుఖదేవగిరి అనే వ్యక్తితో పెళ్లి అయింది.
వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారుమీ కొంతకాలానికి ఆమెకు సుఖదేవగిరి సోదరుడు శాంతగిరితో అక్రమ సంబంధం కలిసింది.
దీంతో అతనిని వదిలేసి మరిదితో సహా పరార్ అయిపోయింది..వేరే ఊరిలో కాపురం పెట్టింది.
అక్కడ కూడా ఇంటి పక్కనే ఉండే భరత్ అనే వ్యక్తితో మళ్లీ అక్రమ సంబంధం పెట్టుకుంది.
ఈ అక్రమ సంబంధం భర్తకు తెలిసి మందలించాడు. తనను మందలించాడన్న కోపంతో ప్రియుడుతో కలిసి ఒక వ్యూహం ప్రకారం రెండో భర్తను చంపేసింది.
ఆ తర్వాత రెండో భర్తను చంపేందుకు సుపారీ ఇచ్చి కిరాయి కుదుర్చుకున్న దీపక్ అని వ్యక్తితో మళ్లీ ప్రేమాయణం మొదలుపెట్టింది .
దీంతో దీపక్. సాయంతో మూడో ప్రియుడిని లేపెద్దామనుకునే. లాగా రెండో భర్త శవం బయటపడి, కుట్ర. మొత్తం బయటపడి, అందరూ జైలు పాలయ్యారు.
