💥💥💥ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మంగళవారం విడుదల చేసింది.💥💥💥

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మంగళవారం విడుదల చేసింది.

ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున (1:3) అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఆహ్వానించింది. హైదరాబాద్‌లోని వెంగల్‌రావు నగర్‌‌లో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌‌ ప్రాంగణంలో ఈ నెల 22, 23 తేదీల్లో వెరిఫికేషన్ జరగనుంది.

విద్యార్హత, కమ్యునిటీ, తదితర అన్ని సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌కు హాజరు కావాలని బోర్డు పేర్కొంది. ఈ నెల 22, 23వ తేదీల్లో వెరిఫికేషన్‌కు హాజరు కాలేని వారు, ఈ నెల 25వ తేదీన వచ్చి సర్టిఫికెట్లు అందజేయవచ్చునని బోర్డు స్పష్టం చేసింది.

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 34 డిపార్ట్‌మెంట్లలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గతేడాది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, గైనకాలజీ, అనస్తేషియా డిపార్ట్‌మెంట్లలోని 174 పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయింది.

ఆయా పోస్టులకు ఎంపికైన డాక్టర్లకు, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు ఇటీవలే నియామక పత్రాలు కూడా అందజేశారు. మిగిలిన 30 డిపార్ట్‌మెంట్లలోని 433 పోస్టులకు సంబంధించిన మెరిట్ లిస్ట్‌ను మంగళవారం విడుదల చేశారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం, ఉద్యోగాలకు ఎంపికైన డాక్టర్ల జాబితాను విడుదల చేస్తామని బోర్డు తెలిపింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *