
*వే టు న్యూస్ కాంక్లేవ్ లో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు* ఈ కార్యక్రమంలో కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ..
రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ సీఎంబండి సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలిఉద్యమ కేసీఆర్ తో సమస్య లేదు,
ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోనే సమస్యఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అంశంలో మా అమ్మ కుటుంబం నుంచి సరైన సపోర్ట్ రాలేదుఅంతర్గతంగా నేను చెప్పిన అభిప్రాయాలను బయటపెట్టి నన్ను బయటకు బయటకు వెళ్లేలా చేశారుఎన్నికలు ఎప్పుడూ వచ్చిన సరే తెలంగాణ రక్షణ సేనదే అధికారంతెలంగాణ ప్రజలకు మర్చిపోలేనంత మంచి చేశానని చరిత్రలో నా పేరు ఉండాలన్నదే
నా కోరికచేదు అనుభవాలు, కఠిన పరిస్థితులు చూశాకే నాలో మార్పు వచ్చిందిరాష్ట్రంలో గుణాత్మక మార్పు తెచ్చేందుకే తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేశాం
🔹నా జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు, కఠిన పరిస్థితులు చూశాక నాలో చాలా మార్పు వచ్చింది.
🔹ఎవరికీ నచ్చకపోయినా సరే మనకు నచ్చింది చేయాలన్నది నేను గుర్తించాను.
🔹కేసీఆర్ గారు చాలా గొప్ప మనిషి. ఇందులో నాకు ఎలాంటి వేరే అభిప్రాయం లేదు.
🔹రాదనుకున్న రాష్ట్రాన్ని ఆయన సాధించి పెట్టారు.
🔹ఉద్యమ కేసీఆర్ గారితో నాకు ఎలాంటి సమస్య లేదు.
🔹ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ గారితోనే నాతో పాటు చాలా మందికి సమస్య వచ్చింది.
🔹బీఆర్ఎస్ లో చాలా ఢిపరెంట్ గా వ్యూ చెప్పేది నేనే ఉండే.
🔹ఇంటర్నల్ గా నా అభిప్రాయాలు ఎప్పుడు చెబుతుండేది నేను ఇంటర్నల్ గా చెప్పిన అభిప్రాయాన్ని బయటకు వచ్చేలా చేశారు.
🔹దాంతో ఇంకా నేను నా అభిప్రాయానికి బయటకు చెప్పాల్సిన పరిస్థితి తెచ్చారు.
🔹ఇక అప్పటి నుంచి నేను ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని అనుకొనే పార్టీ పెట్టాను.
🔹చుక్క రక్తం చిందించకుండా రాజ్యాంగం ద్వారా దేశంలో మార్పు తెస్తానని అంబేడ్కర్ గారు అన్నారు.
🔹అదే విధంగా నేను కూడా రాజకీయ పార్టీ ద్వారా మంచి మార్పు తేవాలని వచ్చాను.
🔹కచ్చితంగా నన్ను ప్రజలు దీవిస్తారు, ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉంది.
🔹రాజకీయాల్లో కచ్చితంగా వ్యూహాలు ఉండాలి. నేను కేసీఆర్ గారి వద్దే వ్యూహాలు నేర్చుకున్నాను.
🔹ఆడపిల్లలు రాజకీయాల్లో వచ్చి ఫెయిల్ అయితే వారికి ఏమీ చేతకాదని ముద్ర వేస్తారు.
🔹అందుకే కచ్చితంగా సక్సెస్ కావాలని నేను మంచి స్ట్రాటజిస్ తో ముందుకు వెళ్తున్నా.
🔹మన రాష్ట్ర మహిళలు, భారత మహిళ బరువు నా మీద ఉంది. నేను సక్సెస్ అయితే వాళ్లు ఇంకా ధైర్యంగా రాజకీయాల్లోకి వస్తారు.
🔹నేను ఏ సమస్య వచ్చిన సరే పాజిటివ్ గానే ఆలోచిస్తాను. ఆడపిల్లలు డిప్రెస్ కావద్దు.
🔹మన దేశంలో 80 శాతం మంది 30 వేల లోపే సంపాదిస్తున్నారు.
🔹అందులో కూడా 70 శాతం విద్య, వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారు. వారి వద్ద సేవింగ్స్ అనేవే ఉండటం లేదు.
🔹అందుకే ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యం అనేది ప్రైవేట్ లో అయిన సరే ఫ్రీ గా ఇవ్వాలి.
🔹రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు తేవాలన్న బలమైన సంకల్పంతోనే తెలంగాణ రక్షణ సమితి పెట్టాం.
🔹గత ప్రభుత్వం గానీ ఈ ప్రభుత్వం గానీ రైతులకు ఏమాత్రం మంచి చేయటం లేదు.
🔹వాళ్లు ధరణి అంటే వీళ్లు భూమాత అంటున్నారు. నేమ్ మారినా గేమ్ మాత్రం మారలేదు.
🔹వ్యవసాయం రంగంలో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది.
🔹అదే విధంగా యువతకు ఉద్యోగాలు ఇవ్వటం మాత్రమే కాదు, వారిని ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తేవాలి.
🔹అందుకే మేము మన యువతను నమ్మి 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు వారికి రుణాలు ఇస్తాం.
🔹వారి వ్యాపారాలు పెట్టేలా ప్రోత్సహిస్తాం. వారిలో నుంచి ఒక్క గూగుల్ లాంటి సంస్థ వచ్చిన చాలు.
🔹సోషల్ జస్టిస్ అంటే కులాలకు మాత్రమే కాదు, సమాజంలో అవకాశాలు పొందలేని అన్ని వర్గాలకు మేలు చేయటం. వికలాంగులు, మాజీ మావోయిస్టులు, మాజీ ఆర్మీ జవాన్లు, సీనియర్ సిటిజన్స్ ఇలా అన్ని వర్గాలకు మంచి చేయటమే సోషల్ జస్టిస్.
🔹అదే విధంగా అన్ని కులాల వారి, ఆడబిడ్డలకు రాజకీయంగా ఎదిగేందుకు మంచి అవకాశాలు కల్పించాలి.
🔹జెన్ జీ అంటే ఈ కొత్త తరాన్ని మెప్పించటానికి రాజకీయ నాయకులు చాలా కష్టపడాల్సి ఉంటుంది.
🔹వాళ్లు తలుచుకుంటే ప్రభుత్వాన్ని పడేయగలరన్నది నేపాల్ లో చూశాం.
🔹ఐతే జెన్ జీ కి మనం డాక్టర్లు, ఇంజనీర్లు అని కాకుండా రాజకీయాలు, సామాజిక అవగాహన కూడా చేయించాలి
🔹మేము రాజకీయంగా ఏం చేసిన సరే అందులో మా కోర్ బిలీఫ్ ఉంటుంది.
🔹మా పార్టీ వరకు వచ్చే సరికి మా కోర్ బిలీఫ్ తెలంగాణయే.
🔹మేము ఏం పనిచేసిన సరే అంతర్లీనంగా తెలంగాణ ప్రయోజనాలుంటాయి.
🔹అయితే రాజకీయ నాయకులు ఏం చేసిన సరే వాళ్లు కరెప్ట్ అన్నట్లు మీడియా చూపిస్తుంది కానీ ఫండమెంటల్ గా ఏ నాయకుడు కరెప్ట్ ఉండరు.
🔹ఫ్యామిలీ జీవితాన్ని త్యాగం చేసి ప్రజల కోసం నిలబడే వ్యక్తులే రాజకీయ నాయకులు.
🔹ఈ దేశంలో ఏ పెద్ద మార్పు వచ్చిన సరే అది రాజకీయ పార్టీల కృష్టి కారణంగానే వచ్చింది.
🔹ప్రజాస్వామికంగా మనం అభిప్రాయాలు చెప్పే పరిస్థితి ఉండాలి. భిన్నమైన అభిప్రాయాలను తీసుకోవాలి.
🔹కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తోంది.
🔹ముందుగా ప్రాంతీయ వాదం తర్వాత జాతీయ వాదం ఉండాలని నేను కోరుకుంటా.
🔹అదే విధంగా జెన్ జీ, మహిళలు కూడా పాలిటిక్స్ లోకి రావాలని కోరుతున్నా.
🔹తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసం అన్నది అందరికీ తెలిసిందే కానీ ఇప్పటికీ కూడా మనకు నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతూనే ఉంది.
🔹బీఆర్ఎస్ లక్షా 89 వేల కోట్లు ఖర్చు చేస్తే…కాంగ్రెస్ ఇప్పటి వరకు 30 వేల కోట్లు ఖర్చు చేసింది కానీ తెలంగాణలో కొత్తగా 15 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు.
🔹ఆంధ్రాలో రాజకీయ నాయకులు మాత్రం వాళ్ల ప్రజల నీళ్ల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు.
🔹తెలంగాణ రాకముందు కన్నా కూడా వాళ్లు ఇప్పుడే నీళ్లు ఎక్కువగా వాడుకుంటున్నారు.
🔹నీళ్ల విషయంలో తెలంగాణ ప్రజలను ఇక్కడి రాజకీయ నాయకులు ఫెయిల్ చేశారు.
🔹మనం పెట్టిన ఖర్చుకు వచ్చిన నీళ్లకు సంబంధమే లేకుండా ఉంది.
🔹తెలంగాణ వచ్చి 12 ఏళ్లు గడుస్తున్నప్పటికీ పాలమూరు లో వలసలు ఆగలేదు.
🔹గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదని నేను అనటం లేదు
🔹కానీ మనం వాడుకోవాల్సిన నీళ్లను కూడా పూర్తిగా వాడుకోలేదు.
🔹గోదావరి లో 960 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉంటే… 250 టీఎంసీలు కూడా మనం వాడుకోలేదు.
🔹30 నెలల్లో పూర్తి చేయాల్సిన పాలమూరు ప్రాజెక్ట్ ను 132 నెలలైనా చేయటం లేదు.
🔹32 వేల కోట్ల రూపాయల అంచనాలు కాస్త ఇప్పుడు 85 వేల కోట్ల రూపాయలకు చేరాయి.
🔹పైగా పదేళ్లు నీళ్లు ఇవ్వకపోవటంతో రైతులకు రావాల్సిన రెండున్నర లక్షల కోట్లు ఆదాయం వారికి రాకుండా పోయింది.
🔹ఇప్పటికి కూడా గోదావరి నుంచి 4 వేల టీఎంసీ లు సముద్రంలో కలుస్తున్నాయి.
🔹వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగిన సరే తెలంగాణ రక్షణ సేననే అధికారంలోకి వస్తుంది.
🔹మేము అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం.
🔹పాలిటిక్స్ లో ఇవ్వాళ ఉన్న పరిస్థితి రేపు ఉండదు.
🔹అప్పటి వరకు బలమైన నేతగా ఉన్న వ్యక్తులు కూడా ఒక్క సంఘటనతో డ్యామేజ్ అవుతారు.
🔹బీజేపీ లో బండి సంజయ్ బలమైన నేతగా ఉండేవారు. కానీ వాళ్ల కుమారుడి మీద వచ్చిన ఆరోపణలతో ఒక్కసారిగా పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు.
🔹బండి సంజయ్ గారి కుమారుడి మీద వచ్చిన ఆరోపణలపై రేవంత్ రెడ్డి ఎలా వ్యవహరిస్తున్నారో తెలంగాణ మహిళలు గమనిస్తున్నారు.
🔹నాన్ బెయిల్ సెక్షన్లు ఉన్న కేసుల్లో కూడా అరెస్ట్ చేయకుండా బండి సంజయ్ కు రేవంత్ రెడ్డి మేలు చేసి పెడుతున్నాడు.
🔹కచ్చితంగా ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది.
🔹అవసరమైనప్పుడు కచ్చితంగా తెలంగాణ మహిళలు కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెబుతారు.
🔹ఇవ్వాళ్టి కి కూడా తెలంగాణ లో రోజుకు మహిళపై 7 రేప్ కేసులు నమోదవుతున్నాయి.
🔹బండి సంజయ్ కుమారుడి వ్యవహారంలో ఆమె క్యారెక్టర్ ను తప్పు పట్టేలా మీడియాలో కథనాలు వేస్తున్నారు.
🔹మీడియా ట్రయల్ ద్వారా మహిళలకు నష్టం జరుగుతోంది. ఇటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయవద్దు.
🔹తన కుమారుడి మీద గంభీరమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రధాని తో బండి సంజయ్ గారు వేదిక పంచుకోవాల్సింది కాదు.
🔹ఆయన కేంద్ర హోంమంత్రిగా పదవిలో ఉంటే విచారణ సజావుగా సాగదు. కనుక విచారణ పూర్తయ్యే వరకు పదవి నుంచి తప్పుకోవాలి.
🔹సమస్య ను ఏ పార్టీ వాళ్లు హైలెట్ చేసిన అది మంచిదే. కానీ ప్రభుత్వం దీనిపై స్పందించాలి.
🔹విచారణ పూర్తయ్యే వరకు బండి సంజయ్ ను తప్పించాలని ప్రధాని లెటర్ రాస్తాను.
🔹మోడీ, రేవంత్ రెడ్డి కలిసే ఉన్నారు. బడేభాయ్, చోటే భాయ్ కలిసే ఉన్నారు.
🔹అందుకే తెలంగాణకు ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ లు రాకపోయినా ఆయన స్పందించటం లేదు.
🔹అందుకే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం కాదు, ఆర్ఎస్ఎస్ సీఎం అని నేను అంటాను.
🔹అమ్మతనంతో పాలన జరిగినప్పుడే సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుంది.
🔹అక్కగా కన్నా కూడా అమ్మగా ఆలోచిస్తే ఇంకా ఎక్కువ మంచి చేయవచ్చు.
🔹అందుకే నేను అక్క గా నుంచి అమ్మగా పరిణితి చెందాలని అనుకుంటున్నాను.
🔹మెంటల్లీ ఛాలెంజ్ పిల్లలకు ఈ ప్రభుత్వం కనీసం పెన్షన్ ఇవ్వటం లేదు.
🔹అలాంటి పిల్లల తల్లితండ్రులకు చాలా ఇబ్బందులు ఉంటాయి.
🔹అందుకే వాళ్ల కోసం మేము ప్రత్యేక కన్ సర్న్ చూపుతాం. కేర్ టేకర్స్ ను కూడా ఇస్తాం.
🔹ఆ విధంగా అమ్మగా ఆలోచిస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
🔹లీడర్ ను ఎప్పుడూ కూడా జెండర్ బేస్డ్ గా చూడవద్దు.
🔹అన్ని వర్గాలు తనవే అని అనుకున్నప్పుడు మాత్రమే లీడర్ ఎదగగలడు.
🔹మన ఆలోచన విధానం మారితే అన్ని కూడా మారుతాయి.
🔹మనం లక్ష్యం పెద్దగా ఉండాలి. లీడర్ గా ఎదుగాలని అనుకుంటే సింహం గా ఆలోచించాలి.
🔹నాకు ఎన్టీఆర్, కేసీఆర్, ఇందిరాగాంధీ, సుష్మాస్వరాజ్, మార్గరేట్ థాచర్ ఇష్టమైన నాయకులు.
🔹జ్యోతి రావు పూలే గారు కూడా నాకు చాలా స్ఫూర్తినిచ్చిన నాయకులు.
🔹నేను కూడా వాళ్ల మాదిరిగా గొప్ప నాయకురాలిగా ఎదగాలని అనుకుంటున్నా.
🔹తమిళనాడులో విజయ్ గెలిచినట్లు తెలంగాణలో మేము కూడా గెలుస్తాం.
🔹మన రాష్ట్రంలో గొప్ప నాయకులు ఎవరు లేరు.
🔹రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన అన్ని మాటలు కూడా తప్పారు.
🔹కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్లు పార్లమెంట్ లో మన రాష్ట్రాన్ని అవమానిస్తున్న పట్టించుకోవటం లేదు.
🔹నేను చిన్ననాటి నుంచి కూడా ఎప్పుడు నిజమే చెప్పాలని నేర్చుకున్నా.
🔹ఆ నిజం కారణంగా నాకు నష్టం జరిగినా సరే నేను నిజమే చెబుతా.
🔹లిక్కర్ స్కామ్ పేరుతో బీజేపీ నన్ను కేజ్రీవాల్ గారి బద్నాం చేయాలని చూసింది.
🔹అవినీతి పై పోరాటం చేసిన కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలు చేసి ఆయనను ఇబ్బంది పెట్టింది.
🔹సాంస్కృతి, సాంప్రదాయాల కోసం పోరాటం చేసిన నన్ను లిక్కర్ స్కామ్ అంటూ బద్నాం చేశారు.
🔹కానీ కోర్టు ఆ ఆరోపణలను డిస్మిస్ చేసింది. పైగా విచారణ చేసిన సీబీఐ అధికారిపై విచారణ చేయాలని ఆదేశించింది.
🔹సీబీఐ అధికారిపై విచారణ చేయాలని చెప్పటం దేశంలోనే మొదటిసారి.
🔹లిక్కర్ స్కామ్ అంశం వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ల నుంచి నాకు సరైన సపోర్ట్ రాలేదు.
🔹కానీ మా అత్త వాళ్ల కుటుంబం మాత్రం నాకు సపోర్ట్ చేసి ధైర్యం ఇచ్చింది.
🔹మన మీద ఎలాంటి ఆరోపణలు వచ్చిన సరే మన కుటుంబ సభ్యులు మనతో ఉంటే ఏదైనా సాధించవచ్చు.
🔹తెలంగాణ ప్రజలకు మర్చిపోలేనంత మంచి చేశానని చరిత్రలో నా పేరు ఉండాలన్నదే నా కోరిక.
